Aishwarya Rai : ఐశ్య‌ర్య రాయ్ కు బిగ్ షాక్

నోటీసుల‌కు స్పంద‌న నిల్

Aishwarya Rai : ప్ర‌ముఖ న‌టి ఐశ్వ‌ర్య రాయ్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. కోర్టు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర‌లోని నాసిక్ సిన్నార్ లోని థాంగావ్ స‌మీపంలోని నాసిక్ లోని అద్వాడిలో ఒక హెక్టార్ స్థలం ఉంది. ఈ భూమికి సంబంధించి కేవ‌లం రూ. 21,960 లు ట్యాక్స్ బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది.

ఐశ్వ‌ర్య రాయ్ కొంత కాలం నుంచి దీనిని చెల్లించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లు స‌మాచారం. సినిమాల ప‌రంగా కోట్లాది రూపాయలు సంపాదించినా కేవ‌లం వేలు చెల్లించ‌క పోవ‌డం విస్తు పోయేలా చేసింది అభిమానుల‌ను, తోటి న‌టీన‌టుల‌ను. ప‌దే ప‌దే రిమైండ‌ర్లు జారీ చేశారు సిన్నార్ జిల్లా త‌హ‌సిల్దార్.

చివ‌ర‌కు రిమైండ‌ర్స్ ఇచ్చినా ప‌ట్టించు కోలేదు న‌టి ఐశ్వ‌ర్య రాయ్. అయినా ప‌ట్టించు కోలేదు. నోటీసులు జారీ చేసిన 10 రోజుల లోపు ప‌న్ను చెల్లించ లేక పోతే మ‌హారాష్ట్ర భూ రెవిన్యూ చ‌ట్టం 1966 లోని సెక్ష‌న్ 174 ప్ర‌కారం ఐశ్వ‌ర్య రాయ్(Aishwarya Rai) పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నోటీసులో స్ప‌ష్టంగా పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే సిన్నార్ ప్రాంతంలో ప‌న్ను ఎగ్గొట్టిన వారిలో 1200 మంద‌ది ఉన్నారు. వారిలో ఒక‌రిగా ఐశ్వ‌ర్య రాయ్ కూడా ఉండ‌డం విశేషం. ఈ మొత్తం ట్యాక్స్ చెల్లించ‌కుండా ఉన్న వారి కార‌ణంగా స‌ర్కార్ కు రూ. 1.11 కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌ని పేర్ఒంది.

ఇదిలా ఉండ‌గా న‌టి ఐశ్వ‌ర్య రాయ్ న‌టించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ భారీ స‌క్సెస్ సాధించింది. ఏకంగా రూ. 500 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఊహించ‌ని స‌క్సెస్ కావ‌డం సంతోషాన్ని ఇచ్చింది.

Also Read : ఆర్ఆర్ఆర్ కు మ‌రో అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!