Khushbu Sundar : మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా కుష్బూ

నామినేట్ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

Khushbu Sundar : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ సుంద‌ర్ కు కీల‌క‌మైన ప‌ద‌విని అప్ప‌గించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ మేర‌కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా నామినేట్ చేసింది. ఈ మేర‌కు ఈ కీల‌క నిర్ణ‌యాన్ని అధికారికంగా సోమ‌వారం వెల్ల‌డించింది. ఇక త‌మిళ‌నాడుకు చెందిన ఖుష్బూ సుంద‌ర్(Khushbu Sundar)  మొద‌ట డీఎంకేలో చేరారు. అక్క‌డ ఉండ‌లేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల కంటే ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయ్యారు.

రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేశారు. కానీ గెలుపొంద‌లేక పోయారు. ఖుష్బూ సుంద‌ర్ తో పాటు మ‌రో ఇద్ద‌రిని కూడా నామినేష్ చేసింది కేంద్రం. ఇదిలా ఉండ‌గా త‌న నియామ‌కానికి సంబంధించిన విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాకు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది ఖుష్బూ సుంద‌ర్.

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా నామినేట్ చేసినందుకు కేంద్ర స‌ర్కార్ కు నియ‌మితులైన ఖుష్బూ సుందర్(Khushbu Sundar)  కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు త‌మిళ‌నాడు బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామ‌లై. ఆమె నియామ‌కం మ‌హిళ‌ల హ‌క్కుల కోసం అలుపు లేని సాధ‌న , పోరాటానికి గుర్తింపు అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత‌గా ఆద‌ర‌ణ క‌లిగి ఉంటార‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Also Read : ప్రీతిది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యే

Leave A Reply

Your Email Id will not be published!