Amit Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

గత కొన్ని రోజులుగా అమిత్ షా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు....

Amit Shah : నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో రాజకీయ నేతలంతా దైవ దర్శనం చేసుకోనున్నారు. హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అమిత్ షా దంపతులు మహాద్వార గుండా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Amit Shah Visited

గత కొన్ని రోజులుగా అమిత్ షా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు పర్యటించిన ఆయన తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రచారం ముగియడంతో ఈరోజు గడపాలని నిర్ణయించుకున్నారు. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగించుకుని అమిత్ షా దంపతులు నిన్న సాయంత్రం 6.15 గంటలకు రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. వకుళామాతా గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేశారు. ఈరోజు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుమల నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read : Malika Garg: పల్నాడు పేరు చెడగొట్టారు – ఎస్పీ మలికా గార్గ్

Leave A Reply

Your Email Id will not be published!