Anand Mahindra : మ‌హీంద్రా ట్వీట్ ‘లుంగీ డ్యాన్స్’ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Anand Mahindra : లుంగీ డ్యాన్స్ ఏమిటి అనుకుంటున్నారా. చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో మోస్ట్ పాపుల‌ర్ సాంగ్ ఈ లుంగీ డ్యాన్స్ . ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం మ‌హీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra) చేసిన ట్వీట్. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూప‌ర్ 12లో భాగంగా జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత పోరులో భార‌త జ‌ట్టు అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను 159 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో భార‌త బౌల‌ర్లు స‌క్సెస్ అయ్యారు. అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి సాధించింది.

చివ‌రి బంతి దాకా టెన్ష‌న్ నెల‌కొంది. ఒకానొక ద‌శ‌లో 31 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన త‌రుణంలో భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా క‌లిసి విజ‌యానికి దగ్గ‌ర‌గా తీసుకు వ‌చ్చారు. దినేష్ కార్తీక్ నిరాశ ప‌రిచినా అశ్విన్ విన్నింగ్ షాట్ ఆడ‌డంతో ల‌క్ష‌లాది మంది కేరింత‌లు కొట్టారు.

మెల్ బోర్న్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ భార‌త దేశాన్ని ఒక ఊపు ఊపేలా చేసింది. దాయాదుల మ‌ధ్య జ‌రిగిన ఈ పోరు అత్యంత ఆస‌క్తిని క‌లిగించింది. ఇదిలా ఉండ‌గా మ్యాచ్ ముగిసిన అనంత‌రం స్టేడియం వెలుప‌ల అభిమానులు లుంగీ డ్యాన్స్ చేయ‌డం, ఆ వీడియోను ప్ర‌త్యేకంగా ఆనంద్ మ‌హీంద్రా పోస్ట్ చేయ‌డంతో వైర‌ల గా మారింది. ఎంతైనా మ‌హీంద్రాకు భార‌త దేశం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.

Also Read : పోరాట ప‌టిమ సూప‌ర్ – సుంద‌ర్ పిచాయ్

Leave A Reply

Your Email Id will not be published!