Anantha Sriram : స‌ర్కార్ వారి పాట హిట్ ప‌క్కా

పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్

Anantha Sriram : తెలుగు సినీ వాలిలో పాట‌ల‌కు విప‌రీతమైన ప్ర‌యారిటీ ఉంటుంది. ఒక్కో ద‌ర్శ‌కుడిది ఒక్కో పంథా. మెలోడీ సాంగ్స్ ఎక్కువ‌గా రాసే వారిలో సిరివెన్నెల త‌ర్వాత అనంత శ్రీ‌రామ్(Anantha Sriram) కే ద‌క్కుతుంది.

సినీ ఇండ‌స్ట్రీలో చంద్ర‌బోస్ , శ్రీ‌మ‌ణి, సుద్దాల అశోక్ తేజ తో పాటు చాలా మంది సినీ గేయ ర‌చ‌యిత‌లు త‌మ‌దైన శైలిలో రాస్తున్నారు. త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు.

సాహిత్యం ప‌ట్ల అభిరుచి, వృత్తి ప‌ట్ల అంకిత భావం రాసేలా చేస్తుంది అంటారు వ‌ర్ద‌మాన లిరిసిస్ట్ అనంత్ శ్రీ‌రామ్. ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట‌కు పాట‌లు రాశారు.

ఆయ‌న రాసిన క‌ళావ‌తి క‌ళావ‌తి అనే పాట బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. మిలియ‌న్ల వ్యూస్ తో దూసుకు పోతోంది.

ఇదిలా ఉండ‌గా ఈనెల 12న ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ర్కార్ వారి పాట విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ రంగం సిద్దం చేశారు. ఇక అనంత శ్రీ‌రామ్ రాసిన మ‌రో పాట పెన్నీ సాంగ్ కూడా బిగ్ హిట్ గా పేరొందింది.

ఇందులో విశేషం ఏమిటంటే మ‌హేష్ బాబుతో పాటు కూతురు ఘ‌ట్ట‌మనేని సితార కూడా డ్యాన్స్ చేయ‌డం. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న సంద‌ర్బంగా అనంత్ శ్రీ‌రామ్ (Anantha Sriram)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

స‌ర్కార్ వారి పాట హిట్ కావ‌డం ప‌క్కా అని ధీమా వ్య‌క్తం చేశాడు. తాను రాసిన క‌ళావ‌తి అనే సాంగ్ మ‌హేష్ బాబు కు అత్యంత ఇష్ట‌మ‌ని చెప్పాడు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించ‌గా సిద్ శ్రీ‌రామ్ ఆలాపించారు ఈ పాట‌ను.

Also Read : సౌత్ మూవీస్ తో బాలీవుడ్ షేక్

Leave A Reply

Your Email Id will not be published!