Bhupesh Baghel : రాహుల్ ప్రశ్నలకు జవాబు చెప్పండి
టీ షర్ట్ సరే నాగ సాధవులు మాటేంటి
Bhupesh Baghel : ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel) షాకింగ్ కామెంట్స్ చేశారు. పొద్దస్తమానం భారతీయ జనతా పార్టీకి రాహుల్ గాంధీని టార్గెట్ చేయడంతోనే సరి పోతోందని అన్నారు. ఆయన టీ షర్ట్ వేసుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. ఖద్దర్ దుస్తులు ధరించడం వల్ల మరింత చలి పెడుతుంది. దీని నుంచి రక్షించు కునేందుకు రాహుల్ టీషర్ట్స్ ధరిస్తున్నారంతే. దానిని కూడా బీజేపీ దాని అనుబంధ సంస్థలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత ఏం చేస్తున్నారనే దానిపైనే బీజేపీ ఫోకస్ పెట్టడం దారుణమన్నారు సీఎం. ఇదే సమయంలో రాహుల్ గాంధీ యాత్ర సందర్భంగా లేవనెత్తిన అంశాలు, నిలదీసిన సమస్యలకు ముందు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు భూపేష్ బఘేల్. ఈ దేశంలో దుస్తులు లేకుండా ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు.
వారిలో నాగ సాధవులతో పాటు జైనులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. తాను వారిని కించ పర్చడం లేదన్నారు సీఎం. అయితే దుస్తుల కంటే ముందు దేశం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన పరివారం కృషి చేయాలని సూచించారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. లక్షలాది మంది స్వచ్చంధంగా పాదయాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంకెంత కాలం విద్వేషాలతో, కులం, మతం పేరుతో రాద్దాంతం సృష్టిస్తారంటూ ప్రశ్నించారు భూపేష్ బఘేల్(Bhupesh Baghel).
Also Read : : లవ్లీ ‘లూనా’ రాహుల్ థిల్లానా