Asians Champions Trophy 2023 : చైనాను ఓడించిన భారత్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ
Asians Champions Trophy 2023 : ఛాంపియన్ చైనాకు చుక్కలు చూపించింది భారత హాకీ జట్టు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో(Asians Champions Trophy 2023) భాగంగా భారత పురుషుల హాకీ జట్టు 7-2 తేడాతో చైనాను ఓడించింది. తొలి మ్యాచ్ లోనే గ్రాండ్ విక్టరీ నమోదు చేసి విస్తు పోయేలా చేసింది. ఛాంపియన్ గా ఉన్న చైనాకు ఇది బిగ్ షాక్ .
Asians Champions Trophy 2023 Updates
భారత్, హాకీ మ్యాచ్ మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగింది. మ్యాచ్ లో భాగంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ , వరుణ్ కుమార్ చెరో రెండు గోల్స్ చేశారు. భారత్ తరపున సింగ్ 5వ నిమిషంలో, 8వ నిమిషంలో గోల్స్ చేస్తే వరుణ్ 19వ నిమిషంలో, 30వ నిమిషంలో మరో రెండు గోల్స్ సాధించారు.
చెరో రెండు పెనాల్టీ కార్నర్ లను గోల్ గార్చారు. సుఖ్ జీత్ సింగ్ 15వ నిమిషంలో , ఆకాష్ దీప్ సింగ్ 16వ నిమిషంల్ మన్ దీప్ సింగ్ 40వ నిమిషంలో గోల్ చేశారు. దీంతో భారత జట్టు చేసిన గోల్స్ 7కు చేరుకున్నాయి. ఇక చైనా జట్టు ను గోల్ చేయకుండా నిరోధించడంలో సక్సెస్ అయ్యారు ఆటగాళ్లు. చైనాకు చెందిన వెన్ హూయ్ ఇ 18వ నిమిషంలో గోల్ చేస్తే జిషెంగ్ గావో 25వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో చైనా 2 గోల్స్ కే పరిమితమైంది.
Also Read : Dayanidhi Maran : బీజేపీ గెలవని చోట దాడులు – మారన్
