Sanju Samson BCCI : సంజూ శాంస‌న్ పై బీసీసీఐ వివ‌క్ష

వ‌న్డే జ‌ట్టులో త‌ప్పించ‌డంపై ఆగ్ర‌హం

Sanju Samson BCCI : భార‌త్ లో శ్రీ‌లంక జ‌ట్టు ప‌ర్య‌టించ‌నుంది. ఇందులో భాగంగా మూడు టీ20 మ్యాచ్ ల‌తో పాటు మూడు వ‌న్డే సీరీస్ ల కు సంబంధించి వేర్వేరు జ‌ట్ల‌ను ఎంపిక చేసింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). విచిత్రం ఏమిటంటే టీ20లో ఎంపిక చేసిన సెలెక్ట‌ర్లు వ‌న్డే జ‌ట్టులో శాంస‌న్ కు మొండి చేయి చూపించ‌డం కావాల‌ని వివ‌క్ష చూప‌డ‌మేనంటూ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రో వైపు శిఖ‌ర్ ధావ‌న్ తో పాటు రిష‌బ్ పంత్ ను కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నా ఎందుక‌ని శాంస‌న్(Sanju Samson BCCI) ను ఎంపిక చేయ‌లేద‌ని సీనియ‌ర్ క్రికెట‌ర్లు, మాజీలు, ఫ్యాన్స్ మ‌రోసారి ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌న్డే, టీ20 జ‌ట్టులో రిష‌బ్ పంత్ కు చోటు ద‌క్క‌లేదు.

జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభం కానుంది శ్రీ‌లంక టూర్. రాహుల్ త్రిపాఠి, శుభ్ మ‌న్ గిల్ , శివ‌మ్ మామి, ముఖేష్ కుమార్ ల‌కు పిలుపు వ‌చ్చింది. విచిత్రం ఏమిటంటే సూర్య కుమార్ యాద‌వ్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. మొత్తం ముంబై లాబీకే ప్ర‌యారిటీ ఇచ్చింది బీసీసీఐ. కేఎల్ రాహుల్ , కోహ్లీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ల‌ను ప‌క్క‌న పెట్టారా అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది.

గ‌త ఏడాది అత్య‌ధిక వ‌న్డే మ్యాచ్ ల‌కు సార‌థ్యం వ‌హించిన స్టార్ వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది బీసీసీఐ. సంజూ శాంస‌న్ ను వ‌న్డే జ‌ట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల‌ని కోరుతున్నారు.

Also Read : శిఖ‌ర్‌ కు షాక్ సూర్య‌కు ప్ర‌మోష‌న్

Leave A Reply

Your Email Id will not be published!