RGV : ఆర్జీవీ కామెంట్స్ క‌ల‌కలం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

ఆ ట్వీట్ ఎవ‌రినీ ఉద్దేశించింది కాద‌ని వివ‌ర‌ణ

RGV : సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం. త‌రుచూ వార్త‌ల్లో నిల‌వ‌డం కేవ‌లం ఒకే ఒక్క ద‌ర్శ‌కుడికి మాత్రం చెల్లింది. ఆయ‌నే టాలీవుడ్ ను మొద‌టి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే షేక్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ (RGV) అలియాస్ ఆర్జీవీ మ‌రోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.

ఆయ‌న ఈనెల 22న చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. చివ‌ర‌కు రామ్ గోపాల్ వ‌ర్మ‌పై పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేసేంత దాకా వెళ్లింది.

వివ‌రాల్లోకి వెళితే ఆర్జీవి చేసిన ఆ ట్వీట్ ఏకంగా ఓ ఆదివాసీ ప్రాంతానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు, మాజీ గ‌వ‌ర్న‌ర్ , ప్ర‌స్తుత ఎన్డీయే అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముపై వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేశారు.

ఆర్జీవీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం పై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ద్రౌప‌ది రాష్ట్ర‌ప‌తి అయితే పాండ‌వులు ఎవ‌రు అవుతారంటూ , అంత‌క‌న్నా ముఖ్యంగా కౌర‌వులు ఎవ‌రూ అంటు ట్వీట్ చేశాడు ఆర్జీవీ(RGV) .

ఈ ట్వీట్ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు భ‌గ్గుమన్నారు. నిప్పులు చెరిగారు. ఇలాగేనా ఓ ఆదివాసి బిడ్డ‌పై కామెంట్ చేయ‌డం అంటూ ఫైర్ అయ్యారు. ద్రౌప‌ది ముర్మును కావాల‌ని కించ ప‌రిచేలా కామెంట్ చేశారంటూ మండిప‌డ్డారు.

వెంట‌నే ఆర్జీవీని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌ను చేసిన ట్వీట్ పై దుమారం చెల‌రేగ‌డంతో రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించాడు. మ‌హా భార‌తంలో ద్రౌప‌ది పాత్ర త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని పేర్కొన్నారు.

ఆ పాత్ర‌ను గుర్తు చేయాల‌నే ఉద్దేశంతోనే తాను ట్వీట్ చేశాన‌ని తెలిపాడు. అంతే త‌ప్ప తాను ఎవ‌రిని ఉద్దేశించి చేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

Also Read : కాస్ట్ క‌టింగ్ ఎఫెక్ట్ నెట్ ఫ్లిక్స్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!