MS Dhoni Fans : సీఎస్కే విజ‌యం ఫ్యాన్స్ ఆనందం

మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్టాక గెలుపు బాట

MS Dhoni Fans : జార్ఖండ్ డైన‌మెట్ , మిస్ట‌ర్ కూల్ గా పేరుంది స్టార్ ప్లేయ‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక టైటిళ్లు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ధోనీకే(MS Dhoni Fans) ద‌క్కుతుంది.

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 14వ సీజ‌న్ లో అనూహ్యంగా ప‌రాజ‌యాల నుంచి త‌న జ‌ట్టును గ‌ట్టెక్కించాడు. అంతే కాదు ఊహించ‌ని రీతిలో టైటిల్ అందించాడు.

ఆ ఘ‌న‌త ధోనీదే. ఎవ‌రిని ఎప్పుడు ఆడించాలో, విజ‌యం ఎలా ద‌క్కించు కోవాలో ధోనీకి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌దు. ఇదిలా ఉండ‌గా ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 15వ సీజ‌న్ లో అనూహ్యంగా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు ఎంఎస్ ధోనీ.

అదేమిటంటే తాను నాయ‌క‌త్వం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. తాజా, మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ విస్తు పోయారు. దీంతో ఆడిన ప్ర‌తి మ్యాచ్ లోనూ ఓడి పోయింది.

తానే ఫినిష‌నర్ గా మారి విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. కాగా ధోనీ ప్లేస్ లో ర‌వీంద్ర జ‌డేజాకు సీఎస్కే యాజ‌మాన్యం నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర నిరాశ‌కు లోన‌య్యాడు జ‌డ్డూ.

ఈ త‌రుణంలో తాను ఇక నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో మ‌ళ్లీ యాజ‌మాన్యం జార్ఖండ్ డైన‌మెట్ కే కెప్టెన్సీ అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీంతో తాను నాయ‌క‌త్వం వ‌హిస్తున్న మ్యాచ్ లో సీఎస్కేకు విక్ట‌రీ సాధించి పెట్టాడు ధోనీ. ఇక సీఎస్కే విజ‌యంతో ధోనీ అభిమానులు తెగ సంతోషం వ్య‌క్తం చేశారు. ధోనీ వుయ్ ల‌వ్ యూ టూ అంటే ప్ల కార్డులు ప్ర‌దర్శించారు.

Also Read : మెరిడిత్ బౌన్స‌ర్ త‌ప్పించుకున్న బ‌ట్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!