Chiranjeevi : చిరుకు జ‌గ‌న్ బంపర్ ఆఫ‌ర్

కాపు కోటా కొల్ల‌గొట్టే ప్లాన్

Chiranjeevi  : తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ఉన్న వ్య‌క్తి చిరంజీవి(Chiranjeevi ). మెగాస్టార్ గా ఏళ్లు గడిచినా త‌న త‌న‌యుడు, అల్లుళ్లు, త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పోటీప‌డి న‌టిస్తున్నారు.

ఆయ‌న న‌టించిన ఆచార్య త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆయ‌న మ‌రీ యంగ్ గా మారుతున్నారు. తాజాగా చిరంజీవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప‌నిలో ప‌నిగా చిరంజీవికి(Chiranjeevi )సీఎం జ‌గ‌న్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం నుంచి శుభ‌వార్త వ‌స్తుంద‌ని చెప్పారు చిరంజీవి. ఏపీ ప్ర‌భుత్వం సినిమా రంగం ప‌ట్ల అత్యంత సానుకూల ధోర‌ణితో ఉంద‌ని కితాబు ఇచ్చారు.

మ‌రో వైపు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ త‌రుణంలో అత‌డిని దెబ్బ కొట్టాలంటే చిరంజీవిని ద‌గ్గ‌రకు చేర్చాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ చిరు భేటీపై అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున లీకులు వ‌స్తున్నాయి. సామాజిక మాధ్య‌మాల్లో మెగాస్టార్ కు జ‌గ‌న్ ఎంపీ సీటు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిరుకు చాన్స్ ఇస్తే కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పు కోవ‌చ్చ‌ని ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్. గ‌తంలో కాపుల‌కు ఇచ్చిన హామీల‌ను మెల మెల్ల‌గా నెర‌వేరుస్తూ వ‌స్తున్నా ఎందుక‌నో ఇబ్బందిక‌రంగా ఫీల‌వుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

Also Read : పాజిటివ్ లుక్ తో సోనాలి హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!