CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కీలక అంశం

ఈ రోజు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది...

CM Revanth Reddy : ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు జరిగిన విచారణకు మత్తయ్య, రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

CM Revanth Reddy Vote for Note Case..

ఈ రోజు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

Also Read : MLA KTR : శేరిలింగంపల్లి నియోజకవర్గం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!