Dil Raju Harish : ‘దిల్ హ‌రీష్’ ఏటీఎం వెబ్ సీరీస్

జీ5లో వెబ్ సీరీస్ స్ట్రీమింగ్

Dil Raju Harish : వాళ్లిద్ద‌రూ పేరు మోసిన వ్య‌క్తులు. ఒక‌రు స‌క్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు. మ‌రొక‌రు డైన‌మిక్ డైరెక్ట‌ర్, ర‌చ‌యిత హ‌రీష్ శంక‌ర్. వీళ్లిద్ద‌రూ క‌లిసి కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

వ్యాపారంలో ఏది వ‌ర్క‌వుట్ అవుతుందో దిల్ రాజుకు(Dil Raju Harish) తెలిసినంత ఇంకెవ్వ‌రికీ తెలియ‌దు. ఇప్ప‌టికే ఓటీటీ ప్లాట్ ఫామ్ మ‌రో నిర్మాత అల్లు అర‌వింద్ చేతిలో న‌డుస్తోంది.

ఇక భార‌త దేశంలో టాప్ మీడియా సంస్థ‌గా పేరొందిన జీ గ్రూప్ ఇటీవ‌లే సోనీతో క‌లిసి పోయింది. ఇంకాస్త టైం ప‌ట్టేలా ఉంది. ఈ త‌రుణంలో దిల్ రాజు, హ‌రీష్ శంక‌ర్ లు ఏటీఎం పేరుతో వెబ్ సీరీస్ కు ప్లాన్ చేశారు.

ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని వీరిద్ద‌రూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. కంటెంట్ పై మంచి ప‌ట్టుంది హ‌రీష్ శంక‌ర్. ఇక విజ‌య‌వంత‌మైన సినిమాలు నిర్మించ‌డంలో టాప్ లో ఉన్నాడు దిల్ రాజు(Dil Raju Harish).

వీరిద్ద‌రి కాంబినేష‌న్ సూప‌ర్. జీ5 ప్లాట్ ఫార‌మ్ లో ప్ర‌సారం కానుంది ఈ వెబ్ డ్రామాకి క‌థ బాధ్య‌త‌లు కూడా శంక‌రే నిర్వ‌హిస్తారు.

ఓటీటీ ప్రేక్ష‌కుల కోసం అన్ని అంశాల‌తో కూడిన వినోదంతో కూడిన థ్రిల్ల‌ర్ గా రూపొందించే ఈ వెబ్ సీరీస్ కు చంద్ర‌మోహ‌న్ .సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌మోహ‌న్ ను అభినందించాడు హ‌రీష్ శంక‌ర్. ఇందులో థ్రిల్ల‌ర్ అంశాల‌ను ఇమిడ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్. హ‌రీష్ తో క‌లిసి దిల్ రాజు కూతురు హ‌న్షిత రెడ్డి, మేన‌ల్లుడు హ‌ర్షిత్ రెడ్డి దీని వెనుక ఉన్న‌ట్లు తెలిపింది.

Also Read : కంగ‌నా నోట య‌శ్..బ‌న్నీ మాట

Leave A Reply

Your Email Id will not be published!