RIP Twitter : ఉద్యోగులు ట్విట్టర్ కు సమాధి కట్టేశారు
ఈజీగా తీసుకున్న బాస్ ఎలాన్ మస్క్
RIP Twitter : ఎలాన్ మస్క్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ లో ఉన్న వ్యాపారవేత్త. సిఇఓ, చైర్మన్ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు బాస్. ప్రస్తుతం అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. భారీ ఎత్తున రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సంచలన నిర్ణయాలకు తెర తీశాడు.
ఆపై సిఇఓ, సీఎఫ్ఓ, లీగల్ హెడ్ లను పీకి పారేశాడు. ఆపై టాప్ పొజిషన్స్ లలో ఉన్న వారిని సాగనంపాడు. అంతేనా ఇంత మంది ఉద్యోగులు నాకెందుకంటూ ఏకంగా 4 వేల మందికి మంగళం పాడాడు. ఆపై కాంట్రాక్టు ఎంప్లాయిస్ 5 వేల మందిని తొలగించాడు. అంతేనా ప్రతి నెలా బ్లూ టిక్ కలిగిన వారు నెల నెలా $8 డాలర్లు చెల్లించాలని హుకూం జారీ చేశాడు.
ఆపై వర్క్ ఫ్రం హోమ్ చెల్లదన్నాడు. అంతేనా ఎవరైనా సరే ఆఫీసులకు రావాల్సిందేనని మౌఖిక సందేశాలు పంపించాడు. ఆపై ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని లేక పోతే మూడు నెలల సమయం ఇస్తున్నాని ఆ తర్వాత వెళ్లి పోవాలంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు. వేలాది మందికి అల్టిమేటం జారీ చేశాడు ఎలాన్ మస్క్.
దీంతో టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్విట్టర్ బాస్ కు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చారు సంస్థలోని ఉద్యోగులు. నీ జాబ్స్ మాకేం వద్దంటూ గుడ్ బై చెప్పేశారు. ఆపై ఎలాన్ మస్క్ పై నిప్పులు చెరిగారు. మరికొందరు ఉద్యోగులు ట్విట్టర్ పని అయి పోయిందని, దానికి ప్రాణం లేదంటూ చని పోయిందంటూ సమాధి(RIP Twitter) కూడా కట్టేశారు.
ఇదే ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి అందమైన ఎమోజీలు కూడా జత చేశారు. దీనిని ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేశారు. దీనిని ఈజీగా తీసుకున్నాడు మస్క్. వెళ్లి పోయిన వారంతా సత్తా లేని వాళ్లని, తనతో ఉన్నవారు సత్తా కలిగిన వారంటూ పేర్కొన్నాడు.
Also Read : ఎలాన్ మస్క్ కు షాక్ ఉద్యోగులు గుడ్ బై