EX MLC Santhosh Kumar : హస్తం వైపు మాజీ ఎమ్మెల్సీ చూపు
ప్రకటించిన సంతోష్ కుమార్
EX MLC Santhosh Kumar : కరీంనగర్ – రాష్ట్రంలో ఎన్నికల వేళ చేరికలు పెరిగాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టికి వలసలు ఊపందుకున్నాయి. నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను వద్దనుకుని మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు.
EX MLC Santhosh Kumar Announced to Join in Congress
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
తాజాగా మరో వికెట్ పడింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్(Congress) పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశారు. బుధవారం మాజీ ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పనై పోయిందని ఆరోపించారు. ప్రత్యేకించి మంత్రి గంగుల కమలాకర్ దౌర్జన్యాలు, దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
Also Read : Raj Gopal Reddy : నా రాజీనామా అభివృద్దికి చిరునామా