Farooq Abdullah : కూటమిపై ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్
ఎన్నికల తేదీల ప్రకటన తర్వాతే నిర్ణయం
Farooq Abdullah : జేకేఎన్సీ చీఫ్ , మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా 25 లక్షల స్థానికేతర ఓటర్లపైనే చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలో ఎన్నికలలో పొత్తు , కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుష్కర్ డిక్లరేషన్ (పిఏజీడి)కి కూడా ఫరూక్ అబ్దుల్లా నాయకత్వం వహిస్తున్నారు.
ఎన్నికల ప్రణాళికలు కూటమి ఐక్యతకు ఆటంకం కలిగించవంటూ స్పష్టం చేశారు. జేకేఎన్సీ చీఫ ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించ లేదు. దాని తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పష్టం చేశారు.
ఎన్సీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. ఒక తీర్మానాన్ని ఆమోదించగలదు. కానీ జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగిన తర్వాతనే అంతిమ నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పారు ఫరూక్ అబ్దుల్లా.
ఇవాళ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగే ఎన్నికలపైనే ఎక్కువగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ కావాలని ఎన్నికల్లో లబ్ది పొందేందుకే స్థానికేతర ఓటర్లను ఎక్కువగా నమోదు చేయించిందని ఆరోపించారు ఫరూక్ అబ్దుల్లా.
ఇది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకమని, ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమని మండిపడ్డారు. అయితే మొత్తం 90 స్థానాలలో తాము పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే పొత్తు గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
Also Read : ప్రజా బలాన్ని కొనలేరు – హేమంత్ సోరేన్