Gautam Gambhir : నూపుర్ శ‌ర్మ‌కు గౌతం గంభీర్ స‌పోర్ట్

మాజీ క్రికెట‌ర్, ఎంపీ ట్వీట్ వైర‌ల్

Gautam Gambhir : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మైన భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌హిష్క‌రించిన నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే బీజేపీ ఎంపీ సాధ్వి ప్ర‌గ్యా రాజ్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

నూపుర్ శ‌ర్మ అన్న‌దాంట్లో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నించింది. త‌మ దేవుళ్ల‌ను విమ‌ర్శించే వాళ్ల‌కు వాళ్ల దేవుళ్ల‌ను విమ‌ర్శిస్తే త‌ప్పేంటి అంటూ నిల‌దీసింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో గ‌తంలో ఎన్న‌డూ సునిశిత అంశాల జోలికి వెళ్ల‌ని భార‌త మాజీ క్రికెట‌ర్లు ఈసారి త‌మ‌దైన గొంతును వినిపిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెట‌ర్ , స్టార్ బౌల‌ర్ గా పేరొందిన వెంక‌టేశ్ ప్ర‌సాద్ సంచ‌ల‌న కామెంట్ చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. క‌ర్ణాట‌క‌లోని బెల్గావి మ‌సీదు ఎదుట నూపుర్ శ‌ర్మ దిష్టి బొమ్మ‌ను ఉరి తీయ‌డాన్ని ఆయ‌న నిల‌దీశారు.

మ‌నం 21వ శతాబ్దంలోనే ఉన్నామా అని ప్ర‌శ్నించాడు. ప్ర‌జ‌లు రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండాల‌ని కోరారు. ఈ త‌రుణంలో నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా మ‌రో మాజీ క్రికెట‌ర్ , ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ గౌతం గంభీర్(Gautam Gambhir) నిలిచాడు.

ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లెట్స్ టాల‌రేట్ ఇన్ టాల‌రెన్స్ అనే హ్యాష్ ట్యాగ్ కు స్పందించాడు.

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మ‌హిళ‌పై దేశ వ్యాప్తంగా ద్వేషం క‌క్క‌డం, చంపుతామ‌ని బెదిరించ‌డం పై సెక్యూలిరిస్టుల మౌనం వ‌హించ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నాడు.

Also Read : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!