ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) తో భారీ ఆదాయం సమకూరుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. రూ. 270 కోట్లు బీసీసీఐకి ఇవ్వనుంది. మూడు సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ కొనసాగనుంది. జెమిని ఐపీఎల్ 2026 కోసం ఏఐ ప్లాట్ఫారమ్లను అందిస్తుంది. బీసీసీఐ తన ఏఐ ప్లాట్ ఫారమ్ జెమిని కోసం గూగుల్ తో ఒప్పందం చేసుకుందని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జెమిని ప్రత్యర్థి చాట్ జీపీటీ కొనసాగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు ఉంటుందని తెలిపింది.
గత సంవత్సరం భారత ప్రభుత్వం డ్రీం 11 రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫారమ్లను నిషేధించినప్పుడు బీసీసీఐ కొత్త గా జెర్సీ స్పాన్సర్ కోసం వెతకాల్సి వచ్చింది. చివరికి, అపోలో టైర్స్ డ్రీమ్11 స్థానంలో జెర్సీ స్పాన్సర్గా చేరి, రూ. 579 కోట్లకు హక్కులను పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద T20 లీగ్ అయిన ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను టాటా గ్రూప్ కలిగి ఉంది. జెమిని పాల్గొన్న తాజా స్పాన్సర్షిప్ భారత క్రికెట్లో ఏఐ ప్లాట్ఫారమ్లపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది. నవంబర్లో తో చాట్ జీపీటీ అనుబంధాన్ని ప్రకటించినప్పుడు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.
