Harish Rao : ప్రైవేట్ టీచర్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్

ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతంలో వ్యత్యాసం ఉంది.. కానీ సామర్థ్యంలో కాదని స్పష్టం చేశారు...

Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది. ఉపాధ్యాయులు అందరికీ గురుపూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హరీష్‌రావు(Harish Rao), ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు(Harish Rao) మాట్లాడుతూ… గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వా ఉపాధ్యాయులకు మాత్రమే రేవంత్ ప్రభుత్వం సన్మానం చేసిందని, గురువులంతా సమానమేనని.. ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని కోరారు. పదోతరగతి ఫలితాలు వస్తే సిద్దిపేట రాష్ట్రంలోనే మొదటి రెండో స్థానంలో ఉంటుందని చెప్పారు. మంచి ర్యాంక్‌లు సాధించి ఉపాధ్యాయులు సిద్దిపేట ప్రతిష్ఠ పెంచారని ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడుతున్నారని.. అలా చేయడం సరికాదని అన్నారు.

Harish Rao Slams

ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతంలో వ్యత్యాసం ఉంది.. కానీ సామర్థ్యంలో కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని గుర్తుచేశారు. పిల్లలను పై తరగతుల వరకు చదివించమటమే తరగని ఆస్తి అని తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ వ్యవస్థలు చేస్తున్నాయని విమర్శలు చేశారు. అమెరికాలో ఎక్కువ మంది చదువుకున్న తెలుగు ప్రజలు ఉన్నారని గుర్తుచేశారు. నియోజకవర్గం పునర్ విభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు. బెస్ట్ అవెలబుల్ స్కూల్స్‌కి ప్రభుత్వం పది నెలలు ఆయిన ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. జిల్లాలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నానని వివరించారు. ఉపాధ్యాయులు పిల్లల్లో ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచాలని కోరారు. కుటుంబ బంధాలు బలపరిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు వ్యక్తులు కాదు.. భావిపౌరులను తయారు చేసే శక్తులు అని హరీష్‌రావు కొనియాడారు.

Also Read : Minister Ram Mohan : ఇన్ని ఎయిర్ పోర్టులు ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ పై ప్రేత్యేక ద్రుష్టి పెట్టిన కేంద్రమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!