Rashmika Mandhana : అత‌ను ఎప్ప‌టికీ నాతోనే ఉంటాడు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై క్ర‌ష్మిక కామెంట్స్

Rashmika Mandhana : గీత గోవిందం మూవీ త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరొందిన ర‌ష్మిక మంధాన అర్జున్ రెడ్డి తో ఫేమ్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి స్నేహితులుగా మారి పోయారు. అయితే వీరిద్ద‌రూ పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇటీవ‌ల ముంబై రెస్టారెంట్ లో , తాజాగా మ‌రో ప్లేస్ లో క‌నిపించి విస్తు పోయేలా చేశారు.

దీంతో వీరు ఏమైనా రిలేష‌న్ లో ఉన్నారా అన్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు. దీనిపై స్పందించింది ర‌ష్మిక మంధాన‌. ఆమె అల్లు అర్జున్ తో క‌లిసి న‌టించిన పుష్ప దుమ్ము రేపింది. బాక్సాఫీసులు బ‌ద్ద‌లు కొట్టింది. అత్య‌ధిక వ‌సూలు సాధించిన పాన్ ఇండియా మూవీగా పేరొందింది.

ఈ త‌రుణంలో ర‌ష్మిక ఇప్పుడు జాతీయ స్థాయిలో టాప్ హీరోయిన్ గా పేరొందింది. ఇటీవ‌ల బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో క‌లిసి న‌టించింది కూడా. విజయ్ దేవ‌ర‌కొండ‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ర‌ష్మిక మంధాన‌(Rashmika Mandhana). అదేమిటంటే విజ‌య్ త‌న కోసం ఎప్పుడూ ఉంటాడ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ న‌టి మాల్దీవుల్లో ఉంది. అన్ని విష‌యాలు మాట్లాడుకుంటామ‌ని చెప్పింది.

ఇద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని స్ప‌ష్టం చేసింది. అక్టోబ‌ర్ 7న విడుద‌లైన గుడ్ బైతో ర‌ష్మిక బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మా మ‌ధ్య అలాంటిది ఏమీ లేద‌ని చెప్పింది ర‌ష్మిక మంధాన‌. అయితే తాము ఏం చేస్తున్నామో తెలుసు కోవాల‌ని కొంద‌రికి ఉంటుంద‌ని ఇందులో ఆశ్చ‌ర్యం ఏమీ లేద‌ని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ‌.

Also Read : పేరెంట్స్ గా మారిన న‌య‌న్..విఘ్నేష్

Leave A Reply

Your Email Id will not be published!