Assam CM : ఆ ఎమ్మెల్యేలు గౌహ‌తిలో ఉన్న‌ట్లు తెలియ‌దు – సీఎం

హిమంత బిస్వా శ‌ర్మ షాకింగ్ కామెంట్స్

Assam CM : అస్సాం ముఖ్య‌మంత్రి(Assam CM) హిమంత బిస్వా శ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తం మ‌హారాష్ట్ర సంక్షోభం వెనుక కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్టీ న‌డిపిస్తోందంటూ విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి.

ఈ త‌రుణంలో గుజార‌త్ రాష్ట్రంలోని సూర‌త్ హోట‌ల్ లో క్యాంప్ పెట్టారు శివ‌సేన రెబ‌ల్ మంత్రి ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని ఎమ్మెల్యేలు.

అక్క‌డి నుంచి ర‌క్ష‌ణ కోసం అస్సాం లోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో మ‌కాం వేశారు. ఇక ధిక్కార స్వ‌రం వినిపించిన ఏక్ నాథ్ షిండే కేంద్రంలోని బీజేపీ త‌మ‌కు అన్ని ర‌కాలుగా స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చిందంటూ ప్ర‌క‌టించారు.

కానీ అస్సాంకు రాష్ట్ర సీఎంగా(Assam CM) ఉన్న హిమంత బిస్వా శ‌ర్మ మాత్రం శుక్ర‌వారం చిలుక ప‌లుకులు ప‌లికారు. అదేమిటంటే రెబ‌ల్ ఎమ్మెల్యేలు గౌహ‌తిలో ఉన్న‌ట్లు అస‌లే తెలియ‌ద‌ని చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది.

మ‌రాఠా సంక్షోభ రాజ‌కీయం పూర్తిగా ఇప్పుడు గౌహ‌తి నుంచే న‌డుస్తోంది. దేశంలోని మీడియా అంతా కోడై కూస్తోంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎమ్మెల్యేలు ఇక్క‌డ ఉన్నార‌నే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు హిమంత బిస్వా శ‌ర్మ‌.

వీరితో అస్సాం ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్ర‌కించారు. మ‌హా వికాస్ అఘాడీ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు అస్సాం సీఎం.

అసోంలో ఎన్నో మంచి హోట‌ళ్లు ఉన్నాయి. ఎవ‌రైనా ఇక్క‌డికి వ‌చ్చి బ‌స చేయొచ్చు. దాంతో స‌మ‌స్య లేదు. మ‌రాఠా ఎమ్మెల్యేలు ఉన్నార‌నే విష‌యం మీరు అడిగే దాకా త‌న‌కు తెలియ‌ద‌న్నారు హిమంత బిస్వా శ‌ర్మ‌.

Also Read : మాదే నిజ‌మైన శివ‌సేన పార్టీ – షిండే

Leave A Reply

Your Email Id will not be published!