IND vs AUS 3rd T20 : హైద‌రాబాద్ లో నువ్వా నేనా

మూడో టి20 మ్యాచ్ కు శ్రీ‌కారం

IND vs AUS 3rd T20 : టి20 సీరీస్ విజేత ఎవ‌రో నిర్ణ‌యించే మూడో టి20 మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై టెన్ష‌న్ నెల‌కొంది. మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ లో భాగంగా భార‌త్ , ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్ లు జ‌రిగాయి.

మొద‌టి మ్యాచ్ మొహాలీలో జ‌ర‌గగా అందులో ఆసిస్ దంచి కొట్టింది. భార‌త్ ను చిత‌క్కొట్టింది. ఇక నాగ్ పూర్ లో జ‌రిగిన రెండో మ్యాచ్ లో భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది.

దీంతో మూడో టి20 మ్యాచ్ హైద‌రాబాద్(IND vs AUS 3rd T20) లో సెప్టెంబ‌ర్ 25న ఆదివారం హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

వ‌చ్చే అక్టోబ‌ర్ నెల‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ల‌ను స‌న్నాహ‌కంగా భావిస్తోంది టీమిండియా.

ఇక ఇవాళ జ‌రిగే కీల‌క మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జ‌ర‌గ‌నుంది. భారత జ‌ట్టు మేనేజ్ మెంట్ ఎవ‌రిని తుది జ‌ట్టులోకి తీసుకుంటుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

నిర్ణ‌యాత్మ‌క ఈ మ్యాచ్ లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రానున్నారు. ఇక రోహిత్ శ‌ర్మ నాగ్ పూర్ లో దంచి కొట్టాడు. కేఎల్ రాహుల్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్ బ్యాటింగ్ ప‌రంగా ప‌టిష్టంగా ఉన్నారు.

ఇక హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ‌ర్ గా ప‌ని కొస్తాడు. అక్ష‌ర్ ప‌టేల్ అద్భుత‌మైన ఫామ్ లో కొన‌సాగుతున్నాడు. ఎప్ప‌టి లాగే దినేష్ కార్తీక్ ఫినిష‌ర్ గా మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు.

నాగ్ పూర్ మ్యాచ్ లో దంచి కొట్టాడు. జ‌స్పీత్ బుమ్రా, హ‌ర్ష‌ల్ ప‌టేల్, యుజ్వేంద్ర చాహ‌ల్ తుది జ‌ట్టులో ఆడ‌నున్నారు.

Also Read : క్రికెట్ మ్యాచ్ కోసం ట్రాఫిక్ రూల్స్

Leave A Reply

Your Email Id will not be published!