IND vs ENG T20 World Cup : ఇంగ్లండ్ భార‌త్ మ్యాచ్ పై ఉత్కంఠ‌

సూర్యను క‌ట్ట‌డి చేస్తే చాలంటున్న బ‌ట్ల‌ర్

IND vs ENG T20 World Cup : అంతా ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 లో భార‌త క్రికెట్ జ‌ట్టు సెమీస్ చేరుకుంది. న‌వంబ‌ర్ 10న రెండో సెమీస్ లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ తో(IND vs ENG T20 World Cup) త‌ల‌ప‌డుతోంది. మాజీ ఆటగాళ్లు భార‌త జ‌ట్టు వైపు మొగ్గు చూపుతున్నారు.

కానీ వ‌ర‌ల్డ్ క‌ప్ పొట్టి ఫార్మాట్ లో ఎవ‌రు ఎప్పుడు గెలుస్తారో చెప్ప‌డం చాలా క‌ష్టం. నిన్న‌టి దాకా గాయ‌ప‌డిన భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కోలుకోవ‌డంతో జ‌ట్టు మేనేజ్ మెంట్ ఊపిరి పీల్చుకుంది. ప్ర‌స్తుతం చూస్తే అటు బౌలింగ్ తో పాటు ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది భార‌త్.

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , ర‌న్ మెషీన్ గా పేరొందిన స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కొంత కాలం అనంత‌రం ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చాడు. అత‌డే టీమిండియా త‌ర‌పున టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మ‌రో వైపు హార్దిక్ పాండ్యా ఎప్ప‌టి లాగే ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఇదే క్ర‌మంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సింది ఒకే ఒక్క‌డు సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాద‌వ్. క్రికెట్ ఫ్యాన్స్ సూర్య‌ను సూర్య భాయ్ గా పిలుచుకుంటున్నారు. ఈ త‌రుణంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Buttler) కూడా ఒక్క సూర్య‌ను పెవిలియ‌న్ పంపిస్తే ఇక భార‌త జ‌ట్టును సుల‌భంగా ఓడిస్తామ‌ని ప్ర‌క‌టించాడు.

ఇక ఇంగ్లండ్ జ‌ట్టును త‌క్కువ అంచ‌నా వేసేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆ జ‌ట్టు టోర్నీ స‌మ‌యంలో అద్భుతంగా రాణిస్తుంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు షాక్ ఇస్తుంది. ఇక ఇండియా టీమ్ లో పంత్ ఉంటాడా కార్తీక్ ను తీసుకుంటారా అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది.

Also Read : భార‌త్..కీవీస్ ఫైన‌ల్ కు ఖాయం – డివిలియ‌ర్స్

Leave A Reply

Your Email Id will not be published!