IND vs NED T20 World Cup : నెద‌ర్లాండ్స్ పై భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ

56 ప‌రుగుల తేడాతో సూప‌ర్ స‌క్సెస్

IND vs NED T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హాట్ ఫెవ‌రేట్ గా ఉన్న నాలుగు జ‌ట్ల‌లో ఒక‌టిగా నిలిచింది టీమిండియా. ఇప్ప‌టికే సూప‌ర్-12లో భాగంగా జ‌రిగిన తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 4 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఓట‌మి పాల‌వ‌డం ఖాయ‌మ‌ని అనుకున్న త‌రుణంలో ఏకంగా గ్రాండ్ విక్ట‌రీని అందించిన ఘ‌న‌త ఇద్ద‌రికే ద‌క్కుతుంది. ఒక‌రు విరాట్ కోహ్లీ మ‌రొక‌రు పాండ్యా. ఒకానొక ద‌శ‌లో 64 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయిన త‌రుణంలో ఈ ఇద్ద‌రు ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు.

జ‌ట్టును ఒడ్డుకు చేర్చారు. తాజాగా సూప‌ర్ 12 లీగ్ లో రెండో మ్యాచ్ లో నెద‌ర్లాండ్స్ పై(IND vs NED T20 World Cup) 56 ప‌రుగుల తేడాతో సూప‌ర్ స‌క్సెస్ సాధించారు. 180 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 123 ప‌రుగులు మాత్ర‌మే సాధించింది. భార‌త జ‌ట్టు త‌ర‌పున భువి, అర్ష‌దీప్ , అశ్విన్ చెరో వికెట్ తీశారు.

ఇక గ్రూప్ -2లో టీమిండియా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉంది. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ప‌రుగులు సాధించ‌డంలో స‌క్సెస్ అయ్యింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 179 ర‌న్స్ చేశారు. మ‌రోసారి విరాట్ కోహ్లీ రాణించాడు. ఇక కెప్టెన్ రోహిత్ తో క‌లిసి స్టార్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ దుమ్ము రేపాడు.

ముగ్గురూ హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌డంతో భారీ స్కోర్ సాధించింది.

Also Read : ప‌సికూన‌లు భ‌ళా పాకిస్తాన్ విల‌విల‌

Leave A Reply

Your Email Id will not be published!