IND vs NZ 3rd ODI : కదం తొక్కన గిల్ చెలరేగిన రోహిత్
కీవీస్ కు షాక్ భారత్ భారీ స్కోర్
IND vs NZ 3rd ODI : భారత జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది న్యూజిలాండ్ కు. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 386 రన్స్ చేసింది. మరోసారి శుభ్ మన్ గిల్ రెచ్చి పోగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గిల్ 112 రన్స్ చేస్తే రోహిత్ శర్మ 101 పరుగులు చేసి సత్తా చాటారు.
హార్దక్ పాండ్యా 54 రన్స్ తో సత్తా చాటడంతో టీమిండియా(IND vs NZ 3rd ODI) మరోసారి భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక పాండ్యాకు తోడుగా శార్దూల్ జత కట్టాడు. 25 పరుగులు చేశాడు. ఒకానొక దశలో భారత్ 400 రన్స్ కూడా దాటుతుందేమోనన్న అనుమానం కలిగింది. కానీ ఓపెనర్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు.
ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 35 మాత్రమే చేస్తే ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ విఫలమయ్యారు ఎప్పటి లాగే. టిక్నర్ , జాకప్ చెరో మూడు వికెట్లు తీశారు. బ్రేస్ వెల్ కు కీలక వికెట్ లభించింది. మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
కానీ తాను తీసుకున్న నిర్ణయం తనకు శాపంగా మారుతుందని అనుకోలేదు. బ్యాటింగ్ కు అనువైన పిచ్ గా పేరుంది ఇండోర్ స్టేడియంకు. శుభ్ మన్ గిల్ 13 ఫోర్లు 5 సిక్సర్లతో 78 బంతుల్లో సెంచరీ చేశాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ మొదటి వికెట్ కు 212 పరుగులు జోడించడం విశేషం. ఇంతటి భారీ స్కోర్ సాధించాలంటే కీవీస్ భారీ పోరాటం చేయాల్సి ఉంటుంది.
Also Read : శాంసన్ ఓకే కానీ ధోనీ లాంటోడు కావాలి