India Semis T20 World Cup : సెమీ ఫైనల్ కు చేరిన ఇండియా
13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విక్టరీ
India Semis T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ -2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రూప్ -ఎలో ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు టోర్నీలో మొదటగా సెమీ ఫైనల్ కు చేరుకోగా ఇంగ్లండ్ జట్టు రెండో జట్టు సెమీస్ కు చేరింది. ఇక గ్రూప్ -బిలో ఊహించని రీతిలో టైటిల్ ఫెవరేట్ గా ఉన్న సౌతాఫ్రికా జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది నెదర్లాండ్స్ జట్టు.
లీగ్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో భారత జట్టు(India Semis T20 World Cup) సెమీ ఫైనల్ కు చేరడం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇవాళ బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ ఆడుతోంది. ఆదివారం అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ సఫారీలకు షాక్ ఇచ్చింది.
ఇక పాక్, బంగ్లా జట్లు చివరి నాలుగు స్థానాల్లో చివరి స్థానం కోసం పోరాడుతున్నాయి. గ్రూప్ బిలో పాయింట్ల పరంగా చూస్తే భారత జట్టు ఆరు పాయింట్లో ఉంది. మెల్ బోర్న్ లో జింబాబ్వేతో ఆడనుంది. 159 పరుగుల టార్గెట్ ముందుంచింది నెదర్లాండ్స్ . భారీ టార్గెట్ ను ఛేదేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.
చివరగా 13 పరుగులు చేయలేక చేతులెత్తేసింది. ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పక తప్పదు సౌతాఫ్రికాకు. 6 ఓవర్లలోనే ఓపెనర్లు డికాక్ , టెంబా బవుమాను అవుట్ చేయడంతో సఫారీల కంగారూ మొదలైంది.
Also Read : లంక క్రికెటర్ గుణ తిలక అరెస్ట్