Jacqueline Fernandez : రూ. 10 కోట్ల తో డైమండ్స్ భారీ గిఫ్ట్స్
రూ. 200 కోట్ల కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్
Jacqueline Fernandez : ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలని స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). కేసుకు సంబంధించి ఛార్జిషీట్ కు గురైంది నటి.
రూ. 200 కోట్ల కేసుకు సంబంధించి నటి సుకేష్ చంద్ర శేఖర్ ను కలవడం కలకలం రేపింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు రూ. 10 కోట్ల విలువైన బహుమతులు అందజేసినట్లు ఈడీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది.
ఈడీ ద్వారా రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నమోదైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) కు అక్రమాస్తులు సుఖేష్ చంద్రశేఖర్ నుండి ఖరీదైన బహుమతులు అందాయని ఈడీ వెల్లడించింది.
ఈ జాబితాలో డిజైనర్ హ్యాండ్ బాగ్ లు, కార్లు, విలువైన వజ్రాలు, ఆభరణాలు, భారీ బహుమతులు ఉన్నాయని తెలిపింది. నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు ఆమె కుటుంబీకులకు కూడా నగదు చంద్రశేఖర్ ఇచ్చారని ఆరోపించింది.
ఆధారాలతో సహా వివరాలు పేర్కొంది. ఇదిలా ఉండగా బహుమతులు అందుకున్న వాటిలో వైవ్స్ సెయింట్ లారెంట్ , డియోర్ నుండి 4 బ్యాగ్ లు, లూయిస్ విట్టన్ , లౌబౌటిన్ నుండి మూడు బూట్లు , గూచీ నుండి రెండు దుస్తులు, పెర్ఫ్యూమ్ లు, నాలుగు ఖరీదైన పిల్లులు, ఒక మినీ కూపర్ , రెండు అత్యంత ఖర్చుతో కూడుకున్న రెండు డైమండ్ చెవి పోగులు, బహుళ రంగుల డైమండ్ బ్రాస్ లెట్ అందుకున్నారు జాక్వెలిన్ ఫెర్నాండేజ్.
అంతే కాకుండా రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పిల్లి తో పాటు మొత్తం రూ . 10 కోట్ల విలువైన బహుమతులు అందుకుంది.
Also Read : విజయ్..అనన్యతో ‘తల్లి’ పూజలు