SS Rajamouli James Cameron : రాజ‌మౌళికి కామెరూన్ కితాబు

ఆర్ఆర్ఆర్ రెండు సార్లు

SS Rajamouli James Cameron : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రౌద్రం. రుధిరం.ర‌ణం (ఆర్ఆర్ఆర్) మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమెరికా లోని కాలిఫోర్నియాలో జ‌రిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్రమం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బెస్ట్ రీజినియ‌ల్ చిత్రంతో పాటు బెస్ట సాంగ్ నాటు నాటు పాట‌కు అవార్డు ద‌క్కింది.

దీంతో రాజ‌మౌళి , మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంఎం కీర‌వాణి , న‌టించిన రామ్ చ‌ర‌ణ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారింది. గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం అందుకుని చ‌రిత్ర సృష్టించింది ఆర్ఆర్ఆర్ మూవీ. ప్ర‌స్తుతం హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ రెండుసార్లు రాజమౌళిని చూడడం విశేషం.

ఇదిలా ఉండ‌గా అమెరికా లోని ఓ కార్య‌క్ర‌మంలో అనుకోకుండా దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఎస్ఎస్ రాజ‌మౌళి, జేమ్స్ కామెరూన్(SS Rajamouli James Cameron) క‌లుసుకున్నారు. ఈ సినిమా బావుందంటూ కితాబు ఇచ్చారు. అంతే కాదు త‌న భార్య సుజిక్ జేమ్స్ ను కూడా చూడ‌మ‌ని తాను చెప్పాన‌ని ఈ విష‌యాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఎస్ఎస్ రాజమౌళి పంచుకున్నారు. యావ‌త్ ప్ర‌పంచం మెచ్చిన ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి కామెరూన్ 10 నిమిషాల పాటు నాతో త‌న అభిప్రాయల‌ను పంచుకున్నార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టికీ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్ త‌న‌తో మాట్లాడ‌టాన్ని ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక పోతున్నాన‌ని పేర్కొన్నారు ఎస్ ఎస్ రాజ‌మౌళి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : ఆర్ఆర్ఆర్ కు మ‌రో అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!