Janhvi Kapoor Buys : రూ. 65 కోట్ల‌తో జాన్వీ క‌పూర్ ఇల్లు కొనుగోలు

పోటీ ప‌డి కొనుగోలు చేస్తున్న సెలిబ్రిటీలు

Janhvi Kapoor Buys : దివంగ‌త న‌టి శ్రీ‌దేవి, బోనీ క‌పూర్ ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్(Janhvi Kapoor Buys) అత్యంత ఖ‌రీద‌నై భ‌వంతిని కొనుగోలు చేశారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 65 కోట్లు పెట్టి కొన్న‌ది ఈ ముద్దుగుమ్మ‌. ముంబైలోని బాంద్రాలో ఖ‌రీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది.

ఈ ఇంటికి సంబంధించి 8,669 చ‌ద‌ర‌పు అడుగులు క‌లిగి ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో ప్రైవేట్ గార్డెన్ , ఐదు పార్కింగ్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని స్క్వేర్ ఫీట్ ఇండియా వెల్ల‌డించింది. ఇదిలా ఉడ‌గా గ‌త రెండు సంవ‌త్స‌రాలలో న‌టి జాన్వీ క‌పూర్(Janhvi Kapoor Buys) ఇంత‌కు ముందు కూడా కొనుగోలు చేసింది.

ఈ డ్యూప్లెక్స్ రెండోది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఇంటిని ఆమె చెల్లెలు ఖుషీ క‌పూర్ , తండ్రి బోనీ క‌పూర్ క‌లిసి కొనుగోలు చేశారు. బాంద్రా వెస్ట్ లోని యూనియ‌న్ పార్క్ రోడ్ లోని పాలి హిల్ లో కుబెలిస్క్ బిల్డింగ్ లోని మొద‌టి , రెండో అంత‌స్తుల‌లో 101, 201 అపార్ట్ మెంట్ ల‌తో డ్యూప్లెక్స్ రూపొందించారు.

రియ‌ల్ ఎస్టేట్ పోర్ట‌ల్ ఇండెక్స్ ట్యాప్ డాట్ కామ్ నుండి పొందిన ప‌త్రాల ప్ర‌కారం ఒప్పందం అక్టోబ‌ర్ 2022లో సంత‌కం చేసి ఉంది. నిర్మాణం 2002లో జ‌రిగిన‌ట్లు అందులో పేర్కొన్నారు. ఈ డ్యూప్లెక్స్ ను విక్ర‌యించేది కింటు బ‌జాజ్. 6,421 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెంట్ ప్రాంతంలో విస్త‌రించింది ఉంది.

ఓపెన్ గార్డెన్ ఏరియాతో పాటు స్విమ్మింగ్ పూల్ , ఐదు కార్లు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. మొత్తంగా జాన్వీ క‌పూర్ మ‌రోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.

Also Read : అదంతా అబ‌ద్దం క‌న్నీటి ప‌ర్యంతం

Leave A Reply

Your Email Id will not be published!