Kangana Ranaut Yash : బిగ్ బి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్న య‌శ్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కంగ‌నా ర‌నౌత్

Kangana Ranaut Yash : వివాదాస్ప‌ద న‌టిగా పేరొందిన కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియా సినిమాలు భార‌త దేశాన్ని ఊపేస్తున్నాయి. ఓ వైపు పుష్ప రాజ్ ఇంకో వైపు ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాయి.

తాజాగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌శ్ , సంజ‌య్ ద‌త్, ర‌వీనా ఠాండ‌న్ న‌టించిన కేజీఎఫ్‌-2 మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే రూ. 250 కోట్ల‌ను దాటేసింది. కొత్త చ‌రిత్ర‌ను సృష్టించేందుకు రెడీగా ఉంది.

యావ‌త్ దేశంతో పాటు ఓవ‌ర్సీస్ లో సైతం బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. తాజా అంచ‌నా ప్ర‌కారం రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. నిన్న‌టి దాకా ఆర్ఆర్ఆర్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తే తాజాగా కేజీఎఫ్ 2 దుమ్ము రేపుతోంది.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాల్లో ఈ చిత్రం రెండోదిగా నిలిచింది. ఈ సంద‌ర్భంగా తాజాగా కంగ‌నా ర‌నౌత్( Kangana Ranaut) త‌న ఇన్ స్టాగ్రామ్ లో అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ దేశంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ త‌ర్వాత 1970 నుంచి ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఖాళీ స్థానాన్ని య‌శ్ భ‌ర్తీ చేయ‌బోతున్నాడంటూ పేర్కొన్నారు.

దీంతో య‌శ్ ను అమితాబ్ స్టార్ తో పోల్చ‌డంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు . కంగ‌నా ర‌నౌత్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు కంగ‌నా ర‌నౌత్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : రెండోపెళ్లికి సిద్ద‌మ‌వుతున్న నాగ‌చైత‌న్య‌

Leave A Reply

Your Email Id will not be published!