Kichannagari Laxma Reddy : సబితపై పోటీకి కిచ్చెన్నకు ఛాన్స్
కాంగ్రెస్ పార్టీలో కీలక చర్చ
Kichannagari Laxma Reddy : హైదరాబాద్ – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ వార్ రూమ్ లో ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చర్చోప చర్చలు జరిపింది. ఇంకా కొన్ని సీట్లపై ఒక అవగాహనకు రాలేదని సమాచారం.
Kichannagari Laxma Reddy May be Got A chance
తొలి విడతలో 55 సీట్లను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక రెండో జాబితాను సిద్దం చేసే పనిలో పడింది. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై ఎక్కువగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు.
అమెను తట్టుకుని నిలబడగలిగే నాయకులు స్థానికంగా ఎవరూ లేరని ఇందుకు గాను పార్టీలో సీనియర్ నాయకుడైన కిచ్చెన్న గారి లక్ష్మా రెడ్డిని(Kichannagari Laxma Reddy) బరిలోకి దించాలని భావిస్తున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి ఓ స్పష్టత కూడా వచ్చినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రా రెడ్డి కి మంచి పట్టుంది. ఇక్కడ ఆమె భర్త ఇంద్రారెడ్డికి ముందు నుంచీ ఆదరణ ఉంది. అనుకోని ప్రమాదంలో ఆయన కాలం చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో సబిత కీలక పదవి పొందారు. ఆ తర్వాత గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : Minister KTR : కాంగ్రెస్ కుతంత్రం కేటీఆర్ ఆగ్రహం