Sourav Ganguly : జ‌ట్టు స‌రే త‌న కోస‌మైనా కోహ్లీ ఆడాలి – దాదా

బీసీసీఐ ప్రెసిడెంట్ సంచ‌ల‌న కామెంట్స్

Sourav Ganguly : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి చీఫ్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) షాకింగ్ కామెంట్స్ చేశాడు. గ‌త కొంత కాలంగా ప‌రుగుల లేమితో నానా తంటాలు ప‌డుతున్నాడు భార‌త క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ.

కేవ‌లం ఒకే ఒక్క హాఫ్ సెంచ‌రీ మాత్ర‌మే న‌మోదు చేశాడు ఇటీవ‌లి కాలంలో. ఇంగ్లండ్ టూర్ లో 20 ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డాడు.

ఆ త‌ర్వాత విండీస్, జింబాబ్వే టూర్ల‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక యూఏఈ(Asiacup 2022) వేదిక‌గా ఆగస్టు 28 ఆదివారం దాయాదులైన భార‌త్ , పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన పోరు ప్రారంభం కానుంది.

ఇప్ప‌టికే ఫుల్ ప్రాక్టీస్ లో నిమ‌గ్నం అయ్యాడు కోహ్లీ(Virat Kohli). యావ‌త్ ప్ర‌పంచం ఈ మ్యాచ్ పై ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. ఈ సంద‌ర్భంగా కోహ్లీ అభిమానులు మాత్రం త‌మ క్రికెట్ దేవుడు రాణించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

ఈ త‌రుణంలో బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆసియా క‌ప్ లో భార‌త జ‌ట్టు కోసం కాక పోయినా క‌నీసం త‌న కోస‌మైన విరాట్ కోహ్లీ రాణించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నాడు దాదా.

కోల్ క‌తాలో 2019లో మాత్ర‌మే రాణించాడు. ఆనాటి నుంచి నేటి దాకా చెప్పుకో ద‌గిన స్కోర్లేవీ లేవు కోహ్లీ ఖాతాలో. కోహ్లీ త‌న కోసం ప‌రుగులు చేయాల‌ని సూచించాడు గంగూలీ.

కోల్ క‌తాలో శ‌నివారం జ‌రిగిన మీడియా ఈవెంట్ లో బీసీసీఐ(BCCI) బాస్ మాట్లాడాడు. భార‌త్ కు మాత్ర‌మే కాకుండా త‌న వ‌ర‌కు రాణించాల‌న్నాడు.

Also Read : దాయాదుల పోరులో జాఫ‌ర్ టీం ఇదే

Leave A Reply

Your Email Id will not be published!