Komatireddy Venkat Reddy : బీసీల కోసం ప‌ద‌వీ త్యాగం

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీసీల కోసం అవ‌స‌రం అయితే తాను న‌ల్ల‌గొండ సీటు కూడా వ‌దిలేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Komatireddy Venkat Reddy Key Comments on BC’s

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. గాంధీ భ‌వ‌న్ లో పీఈసీ స‌మావేశం జ‌రిగింది. దీనిపై భారీ ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. టికెట్ల ఖ‌రారు ఇంకా కొలిక్కి రాలేదు.

స‌ర్వేల ఆధారంగా, అభ్య‌ర్థుల ప‌ర్ ఫార్మెన్స్ ను బ‌ట్టి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని ఇప్ప‌టికే టీపీసీసీ ప్ర‌క‌టించింది. దీంతో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఇప్పుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీల‌కంగా మారారు. మ‌రో వైపు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా ఉండ‌నే ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎవ‌రెవ‌రికి టికెట్లు కేటాయించాల‌నే దానిపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఎక్క‌డ ఎక్కువ ఎవ‌రి జ‌నాభా ఉంటే వారికే సీట్లు ఇవ్వాల‌నే నినాదం బ‌లంగా పుంజుకుంది. ఈ త‌రుణంలో ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో న‌ల్ల‌గొండ జిల్లా అత్యంత చైత‌న్య‌వంతానికి ప్ర‌తీక‌. ఇక్క‌డ క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గులాబీ హవాను త‌ట్టుకుని గెలుపొందారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

Also Read : Revanth VS Uttam : గాంధీ భ‌వ‌న్ లో గ‌రం గ‌రం

Leave A Reply

Your Email Id will not be published!