Mahesh Babu : స‌ర్కార్ వారి పాట బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం

ప్రిన్స్ మ‌హేష్‌ బాబు భావోద్వేగం

Mahesh Babu : ప్రిన్స్ మ‌హేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న సోద‌రుడు ర‌మేష్ బాబు, నిర్మాత బీఏ రాజు తో పాటు ప‌లువురు క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో దూరం కావ‌డాన్ని త‌ట్టుకోలేక పోతున్నాన‌ని పేర్కొన్నాడు.

తాను న‌టించిన స‌ర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లు హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగాయి. అభిమానులు పోటెత్తారు మ‌హేష్ బాబు ను చూసేందుకు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు(Mahesh Babu) ప్ర‌సంగించారు.

క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా సినిమాను వాయిదా వేస్తూ రావాల్సి వ‌చ్చింది. కానీ ఎక్క‌డా గ్యాప్ రాకుండా చేశారు ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్. మంచి క‌థ‌ను అందించాడు.

 

ఈ మూవీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచి పోతుంద‌న్నాడు మ‌హేష్ బాబు(Mahesh Babu). ప్రత్యేకించి నా మేన‌రిజం, నా డైన‌మిజాన్ని స‌రికొత్త‌గా చూపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడంటూ ద‌ర్శ‌కుడికి కితాబు ఇచ్చాడు.

ప్ర‌త్యేకించి సినిమాలో డైలాగులు పోకిరి త‌ర్వాత పేలుతాయ‌న్నాడు. కొన్ని సీన్ల‌లో చేసేట‌ప్పుడు పోకిరి మూవీ గుర్తుకు వ‌చ్చింద‌న్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ అద్భుతంగా స‌పోర్ట్ చేశార‌ని పేర్కొన్నారు ప్రిన్స్ .

ఒక్క‌డు చూసి డైరెక్ట‌ర్ అవుదామ‌ని వ‌చ్చాను కానీ నాకు భారీ చిత్రాన్ని చేసేందుకు ఛాన్స్ ఇచ్చారంటూ ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ మెస్సేజ్ పెట్టాడ‌ని చెప్పారు.

నాన్న గారి అభిమానులు, నా ఫ్యాన్స్ కు మీరు ఫెవ‌రేట్ డైరెక్ట‌ర్ గా ఎల్ల‌కాలం ఉండి పోతార‌ని అన్నారు. ప్రిన్స్ ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం గురించి పంచుకున్నారు. ఆడియ‌న్స్ ల‌వ్ ట్రాక్ కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌డం ఖామ‌న్నారు.

 

Also Read : మహేష్ బాబు నిజంగా బంగారం

Leave A Reply

Your Email Id will not be published!