Mahua Moitra : ప‌రేష్ రావ‌ల్ పై మ‌హూవా క‌న్నెర్ర

బెంగాలీల‌పై సారీ చెప్పిన న‌టుడు

Mahua Moitra : టీఎంసీ ఎంపీ మ‌హూవా మొయిత్రా నిప్పులు చెరిగారు న‌టుడు ప‌రేష్ రావ‌ల్ పై. ఒక ప‌రిణ‌తి చెందిన న‌టుడు ఇలా దిగ‌జారి మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎంత ప‌వ‌ర్ లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడితే అబ‌ద్దాలు నిజాలై పోవ‌న్నారు ఎంపీ.

బెంగాలీల‌ను విమ‌ర్శించ‌డం..తూల‌నాడ‌డం ఒక అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా బెంగాలీలాగా చేప‌లు వండ‌డం నేర్చుకోవాల‌ని ఎద్దేవా చేశారు ప‌రేష్ రావ‌ల్ . గుజరాత్ రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా రెండో విడ‌త బీజేపీ ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన్నారు.

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో బెంగాలీలు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు. దేశ వ్యాప్తంగా ప‌రేష్ రావ‌ల్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కొన‌సాగుతోంది రావెల్ పై( Paresh Rawal).

దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప‌రేష్ రావ‌ల్ బెంగాలీలు అంటే త‌న‌కు వ‌ల్ల‌మాలిన అభిమానం అని, వారి మ‌న‌స్సు నొప్పిస్తే తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.

దీనిపై సీరియ‌స్ గా స్పందించింది మ‌హూవా మోయిత్రా(Mahua Moitra) . శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. బెంగాలీలు క‌ష్ట జీవుల‌ని, వారు ఇంకొక‌రిని ఎప్పుడూ తూల‌నాడిన దాఖ‌లాలు లేవ‌న్నారు. కానీ కావాల‌ని ప‌రేష్ రావ‌ల్ ఇలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు మ‌హూవా మోయిత్రా.

గుజ‌రాతీలు చేప‌లు వండుకుని తింటారు కాబ‌ట్టి చేప స‌మ‌స్య కాద‌న్నారు. కానీ బెంగాలీ భాష‌లో నేను చ‌ట్ట విరుద్ద‌మైన బంగ్లాదేశ్ కు చెందిన రోహింగ్యాల‌ను ఉద్దేశించి మాత్ర‌మే మాట్లాడాన‌ని పేర్కొన్న‌రు ప‌రేష్ రావ‌ల్.

Also Read : దేశాన్ని దోచుకున్న వాళ్లు విమ‌ర్శిస్తే ఎలా – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!