Mandakrishna Madiga : తెలంగాణ‌లో బ‌హ‌జ‌నులు కీల‌కం

ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ

Mandakrishna Madiga : హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ బ‌హుజ‌నులు కీల‌కం కానున్నార‌ని ఈ విష‌యాన్ని గుర్తించి త‌మ విలువైన ఓటును వినియోగించు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి చీఫ్ మంద‌కృష్ణ మాదిగ‌(Mandakrishna Madiga). ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్నేళ్లుగా మాదిగ‌లు అనేక పోరాటాలు, ఉద్య‌మాల‌లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చార‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి దాకా ఏ ఒక్క పార్టీ త‌మ గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు మ‌ద‌కృష్ణ మాదిగ‌.

Mandakrishna Madiga Comment

న‌వంబ‌ర్ 30న ఓటు వేస్తే డిసెంబ‌ర్ 4న మ‌నం క‌న్న క‌ల‌లు సాకారం అవుతాయ‌ని అన్నారు. కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్ర‌మే ముందుకు వ‌చ్చింద‌న్న విష‌యం గుర్తు చేశారు. ఈ సంద‌ర్బంగా మాదిగ జాతి అంతా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి రుణ‌ప‌డి ఉండాల‌న్నారు.

మ‌నం నిర్వ‌హించిన విశ్వ రూప స‌భ‌తో ఒక్క‌సారిగా తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు మారి పోయాయ‌ని పేర్కొన్నారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జాతులంతా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఓటు వేసేట‌ప్పుడు ఎవ‌రు త‌మకు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆలోచించాల‌ని సూచించారు.

Also Read : PM Modi : ఎస్సీల‌కు మోదీ శుభవార్త

Leave A Reply

Your Email Id will not be published!