MI vs PBKS IPL 2023 : పంజాబ్ దెబ్బకు ముంబై విలవిల
13 పరుగుల తేడాతో ఘన విజయం
MI vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయ్యాడు. దీంతో పంజాబ్ మేనేజ్ మెంట్ స్కిప్పర్ గా సామ్ కరణ్ కు అప్పగించింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపింది పంజాబ్. ఇక వరుస విజయాలతో దూసుకు పోతున్న ముంబైకి బిగ్ షాక్ ఇచ్చింది పంజాబ్.
ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించాడు అర్ష్ దీప్ సింగ్. ఆఖరు ఓవర్ లో మ్యాజిక్ చేశాడు. చివరి ఓవర్ లో ముంబై ఇండియన్స్ గెలవాలంటే 16 పరుగులు కావాల్సి వచ్చింది. అర్ష్ దీప్ 2 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 2 వికెట్లు తీశాడు. సింగ్ 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది పంజాబ్.
మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్(MI vs PBKS IPL 2023) ముందుగా బ్యాటింగ్ చేసింది. స్టాండింగ్ కెప్టెన్ సామ్ కరన్ దుమ్ము రేపాడు. 29 బంతుల్లో 55 రన్స్ చేశాడు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 214 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ కామెరాన్ గ్రీన్ 43 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేస్తే సూర్య కుమార్ యాదవ్ 25 బంతులు ఎదుర్కొని 57 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి ఆటను చివరి ఓవర్ దాకా తీసుకు వెళ్లారు. కానీ అర్ష్ దీప్ బౌలింగ్ దెబ్బకు ముంబై తలవంచక తప్పలేదు.
Also Read : చెలరేగిన సూర్య..కామెరాన్