Minister Narayana : వైద్య ఆరోగ్య అధికారులకు కీలక ఉత్తర్వులిచ్చిన మంత్రి

మంత్రి స్వయంగా కొన్ని ఇళ్లను సందర్శించి నీటి వినియోగంపై ఆరా తీశారు...

Minister Narayana : వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున, ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ వైద్యారోగ్యశాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈరోజు (గురువారం) లెనిన్ నగర్, మారుతీ నగర్‌లో మంత్రి నారాయణ పర్యటించారు. డయేరియా ప్రబలుతున్న ప్రాంతాల్లో అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, తాగునీటి బావులను పరిశీలించారు.

Minister Narayana Comment

మంత్రి స్వయంగా కొన్ని ఇళ్లను సందర్శించి నీటి వినియోగంపై ఆరా తీశారు. లెనిన్ నగర్ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను మంత్రి నారాయణ పరామర్శించారు. బాధితుల చికిత్సపై ఆరా తీశారు. డయేరియా నియంత్రణ చర్యలపై స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహం సిబ్బందితో మంత్రి నారాయణ చర్చించారు.

Also Read : MLA KTR : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Leave A Reply

Your Email Id will not be published!