Minister Nimmala : వైసీపీ సర్కార్ కేవలం ఇరిగేషన్ శాఖ లో 18 వేల కోట్ల బకాయిలు..

కొంతమంది అధికారులు కూడా ఇంకా పాత విధానంలోనే ఉన్నారని....

Minister Nimmala : మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే 2019-24మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు.

Minister Nimmala Comment

కొంతమంది అధికారులు కూడా ఇంకా పాత విధానంలోనే ఉన్నారని.. అన్నింటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులూ, వ్యవస్థలోనూ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైసీపీకు ఊడిగం చేసే క్రమంలో కొందరు ఉన్నతాధికారులు పనివిధానం మర్చిపోయారని అనిపిస్తోందని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శలు చేశారు.

Also Read : MP Eatala Rajender : భూమి కోల్పోయిన ప్రజలకు వెంటనే పరిహారం గాని, భూమి గాని చెల్లించాలి

Leave A Reply

Your Email Id will not be published!