Minister Ponguleti : ఎన్ని కోట్లు ఖర్చైనా తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తాము

కోట్లు ఖర్చైనా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తానని స్పష్టం చేశారు....

Minister Ponguleti : పాలేరు నియోజకవర్గంలోని ఓటర్లందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. వీరికి పింఛన్‌, ఇళ్లు, గ్రామంలో రోడ్డు, రేషన్‌కార్డు కల్పిస్తామని పొంగులేటి తెలిపారు.

Minister Ponguleti Comment

కోట్లు ఖర్చైనా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తానని స్పష్టం చేశారు. వ్యవసాయానికి కూడా ప్రణాళికలు రూపొందించామని పొంగులేటి తెలిపారు. రానున్న వర్షాకాలంలో పాలేరు రిజర్వాయర్ లో నీరు లేకపోయినా సాగునీటికి ఇబ్బంది లేకుండా పరిష్కరిస్తామన్నారు. మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య వచ్చినా అధైర్యపడవద్దని పొంగులేటి శ్రీను స్పష్టం చేశారు. అతడికి చెబితే మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మీ కష్టానికి తగిన ఫలాలను దేవుడు మీకు ఇస్తాడు.

Also Read : Amit Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!