Minister Ponnam : రుణమాఫీపై రైతన్నలు బేజారు కావొద్దు…

పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారని చెప్పారు...

Minister Ponnam : రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. రుణమాఫీపై రైతులు కంగారు పడొద్దని.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు రూ.2 లక్షలు రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు. మంగళవారం(ఈరోజు) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని వివరించారు.

Minister Ponnam Comment

పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లు బదలాయింపు చేసుకున్న 8 సీట్లు దాటలేదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని.. మిగిలినవి పూర్తి చేసే పనిలో ఉన్నామని అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెలు సంతోషంగా బస్సులో ప్రయాణిచేందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. దాదాపు రూ. 15 కోట్లు ఆదాయం సమకూరిందని చెప్పారు.

దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రెటరీ ముందు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవగాహన లేకుండా మాజీ మంత్రి కేటీఆర్ రాజీవ్ విగ్రహాన్ని కూల్చివేస్తామని మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అని అడిగారు. మాజీ సీఎం కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నారని విమర్శించారు. రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే వారికి వారు అవమాన పరచుకున్నట్లేనని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Also Read : KTR : మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమన్న సర్కారుకు పట్టింపు లేదు

Leave A Reply

Your Email Id will not be published!