MLA KTR : దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

సంజయ్ కుమార్ క్రషర్‌లో కూర్చుని కంకర సేకరించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు...

MLA KTR : 420 వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. డబ్బు కోసమే పార్టీ మారారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరడం అంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అని అన్నారు. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటికి రావాలని కోరారు. వాగ్దానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

MLA KTR Slams

సంజయ్ కుమార్ క్రషర్‌లో కూర్చుని కంకర సేకరించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డి ఒక్క టికెట్ కూడా ఇవ్వరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదన్నారు. త్వరలో జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత వచ్చి గల్లీ..గల్లీ తిరుగుతారని కేటీఆర్ తెలిపారు.

Also Read : Sneha Rana : అరుదైన ఘనత సాధించిన భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా

Leave A Reply

Your Email Id will not be published!