Raghunandan Rao : మాకూ టైం వ‌స్తుంది – ర‌ఘునంద‌న్

ప‌వ‌ర్ ఉంద‌ని మాట్లాడితే ఎలా

Raghunandan Rao : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం ఉంద‌ని సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లు ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ ఇచ్చిన హామీల‌లో ఒక్క‌టి కూడా నెర‌వేర్చిన దాఖ‌లాలు లేవ‌న్నారు. విచిత్రం ఏమిటంటే త‌న‌ను దుబ్బాక వాసులు గెలిపించార‌న్న క‌సితో , కోపంతో వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆరోపించారు.

డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామ‌న్నారు కానీ మ‌రిచి పోయార‌ని ఎద్దేవా చేశారు. క‌నీసం రింగ్ రోడ్డు మంజూరు చేయ‌లేద‌ని ఎందుక‌ని ప్ర‌శ్నించారు ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao). తండ్రీ కొడుకులు అధికారంలో ఉన్నామ‌ని మిడిసి ప‌డుతున్నార‌ని కానీ ఏదో ఒక రోజు త‌మ‌కు టైం వ‌స్తుంద‌ని అన్నారు ఎమ్మెల్యే.

బీజేపీకి కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారంటూ కేటీఆర్ ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నార‌ని ఇది ఎంత మాత్రం ఒక మంత్రికి త‌గ‌ద‌న్నారు. తాము ప‌వ‌ర్ ను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలుగా గెల‌వ‌లేద‌న్నారు. ఆ విష‌యం కేటీఆర్ తెలుసుకుంటే మంచిద‌న్నారు. త‌మ‌ను ప్ర‌జ‌లు ఎన్నుకుంటే వ‌చ్చామ‌ని చెప్పారు ర‌ఘు నంద‌న్ రావు.

తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు ర‌ఘునంద‌న్ రావు. ఆరోజున తాను ఉన్న ప్లేస్ లో కేటీఆర్ ఉంటారన్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం ర‌ఘునంద‌న్ రావు చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : అడ్డుకున్నా అభివృద్ది ఆగ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!