MP Visveshwar Reddy : ఆ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు వచ్చిన బీజేపీకి తిరుగులేదు

పలువురితో పార్టీ సభ్యత్వం చేయించి రసీదులు అందజేశారు..

MP Visveshwar Reddy : మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్‌ 8వ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్‌, కార్పొరేటర్‌ గూడెపు ఇంద్రసేనతో కలిసి ఆయన ప్రారంభించారు.

MP Visveshwar Reddy Comment

పలువురితో పార్టీ సభ్యత్వం చేయించి రసీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, కౌన్సిల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ తోట శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు రామోజీ అమితాశ్రీశైలంచారి, నిమ్మల సునీతాశ్రీకాంత్‌గౌడ్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Also Read : CM Chandrababu : తిరుమల ఆలయంలో గోవిందా నామాలు తప్ప ఇంకేం వినిపించకూడదు

Leave A Reply

Your Email Id will not be published!