DC vs MI ICC 2022 : చెల‌రేగిన‌ కిష‌న్ ముంబై బిగ్ స్కోర్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముందు భారీ టార్గెట్

DC vs MI ICC 2022  : ఐపీఎల్ -2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జ‌రుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ (DC vs MI ICC 2022 )భారీ స్కోర్ చేసింది. అంతా అనుకున్న‌ట్టే ఇషాన్ కిష‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

ఏకంగా 81 ర‌న్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్లకు చుక్క‌లు చూపించాడు. ఐపీఎల్ లో ఇది రెండో మ్యాచ్ . ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ సీఎస్కే కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్.

మ్యాచ్ లో భాగంగా మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 177 ప‌రుగులు చేసింది నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో. ముంబై లోని బ్ర‌బౌర్న్ స్టేడియంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ముంబై భారీ టార్గెట్ లో ఇషాన్ కిష‌న్ కీల‌క పాత్ర పోషించాడు.

ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రాణించాడు. 41 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రూ క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. కుల్దీప్ యాద‌వ్ 18 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే ఖలీల్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇదిలా ఉండ‌గా బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ అంతే స్థాయిలో ఎదురు దాడి ప్రారంభించింది. రెండు జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉన్న‌ది.

ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇవాళ పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్ , మ‌న్ దీప్ సింగ్ , రిష‌బ్ పంత్ , పావెల్ , ల‌లిత్ యాద‌వ్ , అక్ష‌ర్ ప‌టేల్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాద‌వ్ , ఖ‌లీల్ , క‌మ‌లేష్ నాగ‌ర్ కోట ఆడుతున్నారు.

Also Read : ఐపీఎల్ లో బ్రావో అరుదైన ఘ‌న‌త‌

Leave A Reply

Your Email Id will not be published!