MI vs PBKS IPL 2022 : ముంబై ఇండియ‌న్స్ టార్గెట్ 199

మెరిసిన శిఖ‌ర్ ధావ‌న్..జితేష్ శ‌ర్మ‌

MI vs PBKS : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(MI vs PBKS) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 198 ర‌న్స్ చేసింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ టీమ్ ముందు 199 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

ముందుగా టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(MI vs PBKS) లో శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతంగా ఆడాడు. 70 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

ఇక కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 52 ప‌రుగులు చేశాడు. ఇక చివ‌ర‌గా వ‌చ్చిన జితేష్ శ‌ర్మ 14 బంతులు ఆడి 30 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ల‌లో థంపి 2 వికెట్లు తీయా జ‌స్ప్రీత్ బుమ్రా , ఉనాద్క‌త్ , మురుగన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.

ఇదిలా ఉండ‌గా నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ టైటిల్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి దిగింది. ఇదిలా ఉండ‌గా ఈసారి లీగ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేదు.

మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడిన ముంబై ఓడి పోయింది. ప్ర‌స్తుతం పంజాబ్ కింగ్స్ తో ఐదో మ్యాచ్ ఆడుతోంది. ప్ర‌స్తుతం రోహిత్ సేన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇక డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ గెలుపొందింది. ఇక ముంబై ఇండియ‌న్స్ ఇంకా బోణీ తెర‌వలేదు. రేపు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది.

Also Read : ఉతికి ఆరేసిన రాబిన్ ఉత‌ప్ప

Leave A Reply

Your Email Id will not be published!