Mumtaz Patel : మాట్లాడే ముందు ఆలోచించాలి – ముంతాజ్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన అహ్మ‌ద్ ప‌టేల్ కూతురు

Mumtaz Patel : గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ తీవ్ర స్థాయిలో మండి ప‌డింది. అంతే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం స్పందించారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే వ‌య‌స్సుకు గౌర‌వం ఇస్తాన‌ని కానీ ఇలాంటి ప‌దాలు మాట్లాడ‌టం మంచిది కాద‌న్నారు.

తాను మీ దృష్టిలో రావ‌ణాసురుడినేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల కోసం నిత్యం ప‌ని చేస్తున్న త‌న‌ను కాంగ్రెస్ పార్టీ నేత‌లే కాదు దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ త‌న‌ను రోజూ విమ‌ర్శిస్తుంటార‌ని అన్నారు. వాళ్లంద‌రికీ త‌న‌ను స్మ‌రించ‌క పోతే వాళ్ల‌కు జీవితం గ‌డ‌వ‌ద‌ని, నిద్ర ప‌ట్ట‌ద‌ని ఎద్దేవా చేశారు.

ఈ సంద‌ర్భంగా సోనియా గాంధీకి రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉన్న దివంగ‌త అహ్మ‌ద్ ప‌టేల్ కూతురు ముంతాజ్ ప‌టేల్ స్పందించారు. ఆమె నేరుగా ఏఐసీసీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను టార్గెట్ చేయ‌కుండానే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి సంబంధించిన చీఫ్ తో పాటు ఇత‌ర బాధ్యులు ఎవ‌రైనా స‌రే మాట్లాడే ముందు ఆలోచించి ప‌దాలు జాగ్ర‌త్త‌గా వాడాల‌ని సూచించారు ముంతాజ్ ప‌టేల్(Mumtaz Patel).

ఇదిలా ఉండ‌గా ఆమె ప్రస్తుతం గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆమె బ‌రిలో ఉంటార‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌న్మోహ‌న్ సింగ్ ను దూషించిన వైనాన్ని గుర్తు చేసింది.

శుక్ర‌వారం ఆమె జాతీయ ఛాన‌ల్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

Also Read : బెంగాలీలు మ‌న‌సారా మ‌న్నించండి – రావ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!