Nagarjuna : చై సామ్ విడాకుల‌పై నాగ్ కామెంట్స్

ఎందుకు విడి పోయారో అర్థం కాలేదు

Nagarjuna : తెలుగు సినీ రంగంలో రొమాంటిక్ హీరోగా , బుల్లి తెర‌పై మోస్ట్ పాపుల‌ర్ హోస్ట్ గా ర‌ఫ్పాడిస్తున్న అక్కినేని నాగార్జున(Nagarjuna) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఆయ‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఒక‌రు చైత‌న్య‌, మ‌రొక‌రు అఖిల్. భార్య అమ‌ల‌. ఆమె రెండో భార్య‌. ఏం మాయ చేశావే సినిమా త‌ర్వాత నాగ చైత‌న్య‌, న‌టి స‌మంత ప్రేమ‌లో ప‌డ్డారు అన‌డం కంటే కూరుకు పోయారు.

ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రి ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఆ త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాల పాటు చిల‌కా గోరింక‌ల్లా క‌లిసి మెలిసి ఉన్నారు. ఏమైందో కానీ ఉన్న‌ట్టుండి ఇంక ఉండ‌లేమంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రూ విడాకుల లేఖ‌ను పోస్ట్ చేశారు.

అది ఆ మ‌ధ్య దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. ఎక్క‌డికి వెళ్లినా వీరిద్ద‌రి గురించే. అదేదో దేశానికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్య అన్న‌ట్టు ట్రీట్ చేశారు. ఇదే స‌మ‌యంలో స‌మంత అటు సినిమాల్లో ఇటు వెబ్ సీరీస్ లో బిజీగా మారింది.

చైత‌న్య కూడా మూవీస్ తో ఉన్నాడు. కాగా వీరిద్ద‌రూ విడి పోవ‌డానికి నాగ్ ఫ్యామిలీ(Nagarjuna) కార‌ణం అంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై సామ్ ఎలాంటి కామెంట్ చేయ‌లేదు.

త‌మ‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో మొద‌టిసారిగా స్పందించారు నాగార్జున‌. నాగ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ అన్యోన్యంగా ఉండే వార‌ని నాలుగేళ్ల పాటు హాయిగా సంసారం చేశార‌న్నారు.

స‌మంతే మొద‌ట‌గా విడాకులు కావాల‌ని కోరింద‌ని దీంతో తాము అందుకు ఒప్పుకున్నామ‌ని తెలిపాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ పై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు సమంత‌. ఆమె నోరు విప్పితే కానీ అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డుతుంది.

Also Read : ఇంద్రావ‌తి గాత్రం ‘గంధ‌సిరి’ సుగంధం

Leave A Reply

Your Email Id will not be published!