Nidhi Razdan : ఎన్డీవీకి షాక్ నిధి ర‌జ్జాన్ గుడ్ బై

మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్

Nidhi Razdan : అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడైతే ఎన్డీటీవీని టేకోవ‌ర్ చేసుకుందో ఆనాటి నుంచి రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. దేశంలో ప్ర‌జ‌ల వాయిస్ ను వినిపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తోంది ఎన్డీటీవీ.

ఇప్ప‌టికే టాప్ జ‌ర్న‌లిస్టుల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందిన ర‌వీష్ కుమార్ గుడ్ బై చెప్పారు. తాజాగా ఆయ‌న బాట‌లోనే మ‌రికొంద‌రు ఎన్డీవీని వీడుతున్నారు. ఆన్ స్క్రీన్ మీద అద్భుతంగా న్యూస్ ను, స్టోరీస్ ను ప్ర‌జెంటూ చేస్తూ పేరు తెచ్చుకున్న నిధి ర‌జ్జాన్(Nidhi Razdan) తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అదానీ గ్రూప్ లో తాను ఉండ‌లేనంటూ వెల్ల‌డించింది నిధి ర‌జ్జాన్. ఆమె రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఎన్డీటీవీలో ప‌ని చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా తాను రాజీనామా చేసిన‌ట్లు తెలిపారు. నిధి ర‌జ్జాన్ 2021లో కొంత కాలం ఛానెల్ ను విడిచి పెట్టారు.

ఫిబ్ర‌వ‌రి 2022లో నో స్పిన్ అనే ప్రైమ్ టైమ్ షోకి యాంక‌ర్ గా తిరిగి వ‌చ్చారు. ఇక ఆమె కంటే ముందు జ‌న‌వ‌రి 28న మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ శ్రీ‌నివాస‌న్ జైన్ ఎన్డీటీవీకీ గుడ్ బై చెప్పారు. ఆయ‌న 1995 నుండి న్యూస్ ఛానెల‌తో సంబంధం క‌లిగి ఉన్నాడు.

ఇదే స‌మ‌యంలో ఎన్డీటీవీకి ఆయువుప‌ట్టుగా ఉంటూ వ‌చ్చిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ర‌వీష్ కుమార్ , గ్రూస్ ప్రెసిడెంట్ సుపర్ణ సింగ్ తో మ‌రికొంద‌రు జ‌ర్న‌లిస్టులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఇక ఎన్డీటీవీ ఫౌండ‌ర్స్ ప్ర‌ణ‌య్ రాయ్ , రాధిక రాయ్ కూడా డిసెంబ‌ర్ 2022లో కంపెనీ బోర్డు నుండి వైదొలిగారు.

Also Read : అదానీ మోసం మోదీ మౌనం

Leave A Reply

Your Email Id will not be published!