Kidnapped Family : కిడ్నాపైన ఎన్నారై ఫ్యామిలీ దారుణ హత్య
యుఎస్ లో ఆర్చర్డ్ లో కుటుంబం గుర్తింపు
Kidnapped Family : అత్యంత విషాదకరమైన సన్నివేశం. అనుకోని రీతిలో కిడ్నాప్ నకు గురైన ప్రవాస భారతీయ కుటుంబం చివరకు ఓ తోటలో శవాలై కనిపించడం కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర కాలిఫోర్నియా లోని మెర్సిడ్ కౌంటీకి చెందిన వ్యాపార ట్రక్కింగ్ కంపెనీలో భారతీయ సంతతి కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కిడ్నాప్ కు(Kidnapped Family) గురయ్యారు. తోట సమీపంలోని వ్యవసాయ కూలీ మృత దేహాలను గుర్తించారు.
ఎనిమిది నెలల వయసు కలిగిన అరుహి ధేరి, ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్టిప్ సింగ్ శవాలై కనిపించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంట్ నుండి కిడ్నాప్ ను కు గురయ్యారు. పాప మేనమామ 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్ కూడా కిడ్పాన్ కు గురయ్యాడు.
ఇండియానా రోడ్, హిచన్సన్ రోడ్ సమీపంలోని తోటలో బుధవారం సాయంత్రం మృతదేహాలు కనిపించాయని మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెర్న్ వార్న్కే వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోట సమీపంలోని వ్యవసాయ కార్మికుడు అధికారులను సంప్రదించే లోపే మృత దేహాలను గుర్తించారు. పోలీసులు కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వీడియోను కూడా విడుదల చేశారు.
జస్టీప్ , అమన్ దీప్ చేతులు కట్టుకుని పని చేస్తున్న చోటు నుండి బయటకు వస్తున్నట్లు ఉంది. సంఘటనా స్థలం నుండి బయలుదేరే ముందు కుటుంబం లోని నలుగుర సభ్యులను ట్రక్కులో ఎక్కించినట్లుగా ఉంది.
ఎన్నారై కుటుంబం దారుణ హత్యకు గురి కావడం పట్ల ప్రవాస భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఎన్నారై స్టూడెంట్ దారుణ హత్య